News

13 వేల కోట్లతో మిలట్రీ హార్డ్‌ వేర్‌ సేకరణ

599views

న్యూఢిల్లీ: భారత సైన్యం శక్తి సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేలా రూ. 13,165 కోట్ల విలువైన మిలిటరీ హార్డ్‌వేర్‌ సేకరణ ప్రతిపాదనలకు రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. దేశీయంగా అభివృద్ధి చేసిన 25 ఏల్‌హెచ్‌ మార్క్‌-3 హెలికాప్టర్లతో పాటు మిలిటరీ ప్లాట్‌ఫామ్స్‌, హార్డ్‌వేర్‌ సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో బుధవారం జరిగిన డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో వీటి సేకరణకు ఆమోదం తెలిపారు.

హెలికాప్టర్ల సేకరణకు 3,850 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తుండగా.. మరో రూ.4,962కోట్లతో రాకెట్‌ మందుగండు సామగ్రిని కొనుగోలు చేయనున్నారు. మొత్తం 13,165 కోట్ల రూపాయల కొనుగోళ్లు జరపనుండగా.. వీటిలో దేశీయ సంస్థల నుంచి రూ.11,486 కోట్ల విలువైన మిలిటరీ సామాగ్రి, ప్లాట్‌ఫామ్స్‌ కొనుగోలు చేయనున్నట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో వెల్లడిరచింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి