News

అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసులు పేర్కొనని మమతా!

692views
  • ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని భవానీపూర్‌ ఉప ఎన్నిక కోసం నామినేషన్‌ పత్రాల్లో తనపై పెండిరగ్‌లో ఉన్న ఐదు క్రిమినల్‌ కేసులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడిరచలేదని పశ్చిమ బెంగాల్‌ బిజెపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బిజెపి అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌ ప్రధాన ఎన్నికల ఏజెంట్‌ సజల్‌ ఘోష్‌ రిటర్నింగ్‌ అధికారికి ఆ మేరకు లేఖ రాశారు.

బెనర్జీ తన అఫిడవిట్‌లో వాస్తవాలను అణచివేశారని చెప్పారు. అసొంలోని అనేక పోలీసు స్టేషన్లలో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 120 బి(నేరపూరిత కుట్ర), సెక్షన్‌ 153 ఎ(శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), సెక్షన్‌ 338(ప్రాణానికి హాని కలిగించే లేదా ఇతరుల వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య) ద్వారా ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేసినట్టు ఘోష్‌ చెప్పారు.

గీతా నగర్‌ పోలీస్‌ స్టేషన్‌, పన్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌, జాగిరోడ్‌ పోలీస్‌ స్టేషన్‌, లఖింపూర్‌ పోలీస్‌ స్టేషన్‌, ఉదర్‌బాండ్‌ పోలీస్‌ స్టేషన్‌తో సహా. బెనర్జీ తన అఫిడవిట్‌లో ఈ వివరాలను పేర్కొననందున, ఆమె నామినేషన్‌ పత్రాలను తిరస్కరించాలని ఆయన కోరారు.

‘మమతా బెనర్జీ దాఖలు చేసిన నామినేషన్‌/డిక్లరేషన్‌పై అభ్యంతరం తెలియజేయడానికి నేను అభ్యర్థిస్తున్నాను. ఆమెపై పెండిరగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను వెల్లడిరచడంలో అభ్యర్థి విఫలమయ్యారు’ అని ఆయన పేర్కొన్నారు.

15 కంపెనీల కేంద్ర బలగాలను కోరిన ఈసీ

పశ్చిమబెంగాల్‌ భవానీపూర్‌లో ఉపఎన్నిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 15 కంపెనీల కేంద్ర బలగాలను బెంగాల్‌ పంపించాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసాయుత సంఘటనలపై కోర్ట్‌లలో పోరాటం చేస్తున్న న్యాయవాది ప్రియాంక తిబ్రేవాల్‌ బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హింస చెలరేగిన నేపథ్యంలో ఉప ఎన్నిక సందర్భంగా ఆ తరహా ఘటనలు పునరావృతం కావొద్దని ఈసీ యోచిస్తోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి