
-
నటుడు విజయ వైఖరిపై కోర్టు విమర్శ
చెన్నై: రోల్స్ రాయిస్ ఘోస్ట్ అనే లగ్జరీ కారును ఇంగ్లాండ్ నుంచి 2012లో దిగుమతి చేసుకున్నందుకు ప్రవేశ పన్ను చెల్లించడంలో విఫలమైనందుకు మద్రాస్ హైకోర్టు కొద్దిరోజుల కిందట తమిళ నటుడు ఇళయదళపతి విజయ్పై రూ .1 లక్ష జరిమానా విధించింది. ఈ మొత్తం తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు వెళ్తుంది.
వాణిజ్య పన్ను శాఖ చేసిన పన్ను డిమాండ్ను సవాలు చేయడం ద్వారా పన్ను ఎగవేసేందుకు నటుడు చేసిన ప్రయత్నానికి ధర్మాసనం ఈ జరిమానా విధించింది. రీల్ హీరోలకు పన్నులు కట్టాలంటే మనసొప్పడంలేదని కోర్టు విమర్శించింది. ఇంగ్లండ్ నుంచి తాను దిగుమతి చేసుకున్న కారుకు పన్ను మినహాయింపు కోరుతూ 2012లో హీరో విజయ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
హీరో విజయ్ 2012లో ఇంగ్లండ్లో లగ్జరీ కారును(రోల్స్ రాయిస్) కొనుగోలు చేసి భారత్కు దిగుమతి చేసుకున్నాడు. ఆ కారు దిగుమతికి సంబంధించి భారత ప్రభుత్వానికి పన్ను చెల్లించలేదు. పైగా తన కారుపై దిగుమతి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కొట్టివేసింది.
అంతేగాక పన్ను తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు రూ.లక్ష జరిమానా కూడా విధించింది. పన్ను ఎగవేత దేశ వ్యతిరేక అలవాటు. ఇలాంటి వైఖరి, మనస్తత్వం రాజ్యాంగ విరుద్ధం అని ధర్మాసనం ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ నటులు సమాజంలో సామాజిక న్యాయం తీసుకురావడానికి తమను విజేతలుగా చిత్రీకరిస్తున్నారు. వారి సినిమాలు సమాజంలో అవినీతి కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఉన్నాయి.
కానీ, వారు పన్ను ఎగవేస్తున్నారు. ఒక పద్ధతిలో వ్యవహరిస్తున్నారు, ఇది చట్టాల నిబంధనలకు అనుగుణంగా లేదని జస్టిస్ సుబ్రమణ్యం అన్నారు. ఇలాంటి స్టార్స్ సాధారణ ప్రజలు కూడా పన్నులు కట్టేలా ప్రోత్సహించేలా చేయాలి కానీ.. వీరే పన్నులు కట్టకుండా ఉంటున్నారని విమర్శలు గుప్పించారు. అప్పట్లో కోర్టుతో చీవాట్లు తిన్న హీరో విజయ్ ఎట్టకేలకు పన్ను చెల్లించాడు. తన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారుకు సంబంధించి రూ.40 లక్షల పన్ను చెల్లించాడు.
విజయ్ ప్రభుత్వానికి పన్ను చెల్లించిన విషయాన్ని రాష్ట్ర అధికారులు మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణలో ఇటీవల మద్రాస్ హైకోర్టు లక్ష రూపాయల జరిమానా కట్టాలని, ఆ మొత్తాన్ని తమిళనాడు సీఎం కొవిడ్ రిలీఫ్ ఫండ్కు అందజేయాలని స్పష్టం చేసింది. ఆ జరిమానాతో పాటు, కారుకు చెల్లించాల్సిన మొత్తం పన్ను రూ.40 లక్షలను కూడా విజయ్ చెల్లించినట్టు ప్రభుత్వ వర్గాలు కోర్టుకు తెలిపాయి.
Source: NationalistHub