News

ప్రభుత్వ స్థలంలో హజ్ హౌజ్ నిర్మించే ప్రయత్నాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి – VHP డిమాండ్

312views

ఢిల్లీలోని AAP ప్రభుత్వ హిందూ వ్యతిరేక మరియు ముస్లిం-బుజ్జగింపు విధానాలకు వ్యతిరేకంగా పోరాడటానికి విశ్వ హిందూ పరిషత్ ఒక ఫ్రంట్ ‌ను ప్రారంభించింది. VHP జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, “గత కొన్ని సంవత్సరాలుగా, ఢిల్లీ ప్రభుత్వం ముస్లింలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఉగ్రవాదుల పక్షాన వాదించడం, హిందూ మాన బిందువులపై దాడి చేయడం మరియు హిందువులు కష్టపడి చెల్లించిన పన్నులను హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు వెచ్చించడంలో అపూర్వమైన రికార్డు సృష్టించిందని అన్నారు. “రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదం అనే అగ్నిపర్వతం యొక్క ముఖద్వారం వద్ద ఢిల్లీ కూర్చున్నట్లు కనిపిస్తోంది! ఢిల్లీని జిహాదీ రాడికల్స్ రాజధానిగా మరియు హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక రాజధానిగా మార్చాలనే AAP ప్రయత్నాలను VHP అనుమతించదు!” అని అన్నారు.

ఢిల్లీ పన్ను చెల్లింపుదారుల డబ్బును దోషపూరితంగా, బహిరంగంగా గో హంతకుడు అఖ్లాఖ్ మరియు ఇతర జిహాదీల కోసం ఖర్చు చేశారు. కానీ జిహాదీల మారణకాండలో ఆశువులుబాసిన అంకిత్ సక్సేనా, ధృవ్ త్యాగి, రియా గౌతమ్, యోగేష్ కుమార్, డాక్టర్ పంకజ్ నారంగ్, అంకిత్ గార్గ్, రాహుల్ రాజ్‌పుత్, రతన్ లాల్, ఢిల్లీకి చెందిన అంకిత్ శర్మ వంటి వారిని ఢిల్లీ ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోలేదు? అదే ముస్లిం డాక్టర్ అనాస్ ముజాహిద్ కరోనాతో మరణిస్తే ముస్తఫాబాద్ వెళ్లి అతని కుటుంబానికి 10 మిలియన్లు ఇచ్చాడు. కానీ అదే మహమ్మారికి బలైన డాక్టర్ కెకె అగర్వాల్ వంటి డజన్ల కొద్దీ కరోనా యోధులైన హిందూ వైద్యుల కోసం ఆయన ఏం చేశాడు? అని డాక్టర్ జైన్ ప్రశ్నించారు.

బంగ్లాదేశీలు, రోహింగ్యాల వంటి ముస్లిం చొరబాటుదారులు మరియు జిహాదీల ప్రధాన కార్యాలయాలు, హజ్ హవుజ్ లు ఆయనకు ఆమోదయోగ్యమైనవి. కానీ హనుమాన్ భక్తుడ్ని అని చెప్పుకునే ఆయనకు హనుమంతుడి ఆలయం మాత్రం ఎందుకు ఆమోదయోగ్యం కాదు? అని శ్రీ సురేంద్ర జైన్ ప్రశ్నించారు. ముల్లా/మౌల్వి/ముజ్జిన్‌లకు మంచి జీతాలను ఇస్తాడు, కానీ కోవిడ్ మహమ్మారి సంక్షోభ సమయాల్లో కూడా పూజారి-పురోహితులకు ఎలాంటి సహాయమూ చెయ్యకుండా దూరంగా ఉంటాడు. “రాజధానిలోని బహిరంగ ప్రదేశాలలో వందలాది అక్రమ మజార్లు (సమాధులు) ముఖ్యమంత్రి గారి రక్షణలో అభివృద్ధి చెందుతున్నాయి.” అని డాక్టర్ జైన్ ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA)లు, ఢిల్లీలోని గ్రామ పంచాయితీలు మరియు ప్రజా ప్రతినిధుల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా అనేక భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ భూమిలో హజ్ హౌస్ నిర్మించడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు ఆయన తెలిపారు. ముస్లిం ఓటు బ్యాంకుపై ఆశతో ప్రభుత్వ సొమ్ముతో హజ్ హోజ్ నిర్మించడానికి ముఖ్యమంత్రి ఉద్యుక్తుడవుతున్నాడని, ఈ ముఖ్యమంత్రి ఔరంగజేబుకు ప్రతిరూపంగా మారాడని శ్రీ జైన్ దుయ్యబట్టారు.

ఇప్పటికే దేశ రాజధాని లవ్ జిహాద్, మత మార్పిడులు మరియు జిహాదీ రాడికల్స్ యొక్క సామూహిక హింసల భీభత్సంతో అట్టుడిగిపోతోంది. దీనిపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు నివేదించినప్పటికీ ప్రభుత్వం యొక్క నిర్లిప్త వైఖరి మాత్రం తొలగిపోలేదు. AAP MLA అమానతుల్లా ఖాన్ రాజ్యాంగ పదవిలో కూర్చుని హిందూ సన్యాసి తల నరికేస్తామని బెదిరించటం, శివ విహార్ మరియు సీలంపూర్ లలో జరిగిన అల్లర్లలో AAP నాయకుల పాత్ర ఎవరికీ తెలియనిదేమీ కాదు. ఢిల్లీలో ఎందరో అమాయక హిందూ యువతులు ఇస్లామిక్ జిహాదీలు మరియు చర్చిల కుట్రలకు బలై వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మౌన ప్రేక్షకుడిగా మిగిలిపోయింది. ఢిల్లీలో, పార్లమెంటరీ చట్టాలను లేదా కేంద్ర ప్రభుత్వ విధానాలను రాజ్యాంగ విరుద్ధంగా తూలనాడడంలోనే శాసనసభ సమయమంతా భారీగా దుర్వినియోగమవుతోంది. మత మార్పిడి భూతం నుండి రాష్ట్ర పౌరులను విముక్తి చేయడానికి ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయడంలేదు?” అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం హజ్ హౌస్ ఆలోచనను విరమించుకోవాలని, చొరబాటుదారులు మరియు జిహాదీలకు సేవ చేయడం మానేసి, హిందూ సమాజాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ సురేంద్ర జైన్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. లేకపోతే, జాతీయ రాజధానిలోని పౌర సమాజం వీధుల్లోకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు.

Source : VSK BHARAT

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.