భారత ఐటీ చట్టాలను పాటిస్తున్నామంటూనే కోర్టు ప్రమాణపత్రంలో చేర్చని ట్విట్టర్.. ఆగ్రహించిన ఢిల్లీ హైకోర్టు

628views
నూతన ఐటీ నిబంధనల ప్రకారం.. చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్(సీసీఓ), రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్(ఆర్జీఓ), నోడల్ కాంటాక్ట్ అధికారులుగా శాశ్వత ఉద్యోగులను నియమించినట్లు దిల్లీ హైకోర్టుకు ట్విట్టర్ తెలిపింది అయితే… ఈ మేరకు ట్విట్టర్ దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ఈ వివరాలు లేవని న్యాయస్థానం ఆక్షేపించింది. ఈ వివరాలన్నీ ఉండేలా చూడాలని తెలిపింది. ఈమేరకు ప్రమాణ పత్రం కాపీలను కేంద్ర కౌన్సిల్ సహా ఇతర కక్షిదారులకు అందజేసినట్లు జస్టిస్ రేఖా పల్లి పేర్కొన్నారు.సీసీఓ, ఆర్జీఓ, నోడల్ అధికారి పదవుల కోసం శాశ్వత అధికారులను నియమించామని ట్విట్టర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య.. కోర్టుకు నివేదించారు. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఆగస్టు 4నే ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రమాణపత్రం దాఖలు చేశారు.





