209
భారత్-చైనా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకవైపు చర్చలు కొనసాగుతున్నప్పటికీ సరిహద్దుల్లో డ్రాగన్ భారీగా బలగాలను మోహరిస్తోంది. కొత్త వైమానిక స్థావరాలను నిర్మించడం, విస్తరించడం వంటి చర్యలకు దిగుతోంది. అయితే చైనాకు దీటుగా భారత్ ఆ ప్రాంతంలో అదనంగా 15వేల మంది సైనికులను రంగంలోకి దించింది. ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మూడు రోజుల పాటు టిబెట్లో పర్యటించారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రదేశాలను సందర్శించి సైనికాధికారులతో భేటీ అయ్యారు. యుద్ధసన్నాహాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఇరు దేశాల బలగాల మోహరింపు, జిన్పింగ్ టిబెట్ పర్యటనతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.