News

వారి ఆచూకీ చెప్పినవారికి 20 లక్షల బహుమతి

596views

ఏడాది ప్రారంభంలో స్థానిక ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయం బయట పేలుడు పదార్థాలు అమర్చుతూ సీసీ టీవీ కెమెరాకు చిక్కిన ఇద్దరు ఆగంతకులను గుర్తుపట్టిన వారికి రూ.10 లక్షల చొప్పున నగదు బహుమతి అందజేస్తామని జాతీయ పరిశోధన సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం ప్రకటించింది. ఆ ఇద్దరినీ గుర్తుపట్టేలా సమాచారం ఇచ్చినా, వారి అరెస్టుకు సహకరించినా రివార్డు ఉంటుంది. గత జనవరి 29న దిల్లీలోని ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయం బయట మందుపాతర పేలింది. ఈ కేసును ఫిబ్రవరి 2న ఎన్‌ఐఏకు అప్పగించారు. 150 మీటర్ల మేర ప్రభావం చూపిన నాటి పేలుడులో ఎవరూ గాయపడలేదు. కొన్ని కార్లు దెబ్బతిన్నాయి. పేలుడుకు సంబంధించి కొన్ని చిత్రాలు, వీడియో అందుబాటులో పెడుతున్నామని.. సమాచారం తెలిసినవారు ‘do.nia@gov.in’, ‘info.nia@gov.in’ చిరునామాలకు మెయిల్‌ చేయవచ్చని, 01124368800 లేదా 9654447345 నంబర్లకు ఫోను ద్వారా తెలుపవచ్చని ఎన్‌ఐఏ ప్రతినిధి తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.