
793views
దేశవ్యాప్తంగా కరోనా బారినపడుతున్న మాజీ అథ్లెట్లు, కోచ్ లకు అండగా ఉందేందుకు కేంద్ర క్రీడల శాఖ సిద్ధమైంది. వైరస్ కారణంగా వైద్య, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న క్రీడాకారులను ఆదుకునేందుకు ఓ కార్యక్రమానికి కేంద్ర క్రీడా శాఖ, శాయ్, భారత ఒలింపిక్ సంఘం(ఐఓసీ) కలిసి శ్రీకారం చుట్టాయి. వీరికోసం ఓ ఆన్లైన్ ప్లాట్ఫామ్ను రూపొందించాయి. ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రీడాకారులు తమ పేరు ఇందులో నమోదు చేసుకోగానే తక్షణమే స్పందించి వారికి సాయం చేసేందుకు కృషి చేస్తారు.





