
635views
ఇటీవల ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ మరువక ముందే ఆదివారం తుపాకుల మోతతో అక్కడి అడవులు మరోసారి దద్దరిల్లాయి. దంతెవాడ జిల్లాలో జవాన్లకు మవోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టు మిలీషియా కమాండర్ వెట్టి హుంగా మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇంకొందరు మావోయిస్టులు కూడా ఈ ఘటనలో మరణించి ఉంటారని భావిస్తున్నారు. హుంగాపై రూ.లక్ష రివార్డు ఉంది. కాల్పులు జరిగిన ప్రాంతంలో 8ఎం.ఎం. పిస్టల్, నాటు తుపాకీ, 2కిలోల ఐఈడీ, టపాసులు, మావోయిస్టు సాహిత్యం, కొన్ని మందులను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.





