కర్నూలు జిల్లా,నంద్యాల సంఘమిత్ర ఆవాసము నందు భరతమాత ముద్దుబిడ్డ వీరనారి
ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు స్ఫూర్తిదాయకంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలన, లాలంకరణ తర్వాత విద్యార్థుల ప్రార్థనతో సభ ప్రారంభమైంది. స్థానిక సంఘమిత్ర ఉపాధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, ఘటన కార్యదర్శి శ్రీమతి జయశ్రీ, కార్యవర్గ సభ్యురాలు మరియు యోగా శిక్షకురాలు శ్రీమతి వెంకటేశ్వరి, కుమారి బృహతి మానస వేదిక అలంకరించి, చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించారు.
వక్తలు లక్ష్మీబాయి బాల్యం, నాటి సామాజిక పరిస్థితులు, ఆమె బ్రిటిష్ వారితో పోరాడటానికి కారణమైన పరిస్థితులను, ఆమె వీరోచిత పోరాటాలను విద్యార్థులకు వివరించారు. ఆమె భారతీయులందరికీ ముఖ్యంగా మహిళలలకు స్ఫూర్తి దాత అని తెలియజేశారు.
చిన్నారుల యోగా, గీత్, సాంస్కృతిక కార్యక్రమాల కలబోతతో కార్యక్రమం ఆద్యంతం ప్రేరణ దాయకంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో విభాగ్ సంఘచాలక్ డాక్టర్ ఉదయశంకర్, ప్రముఖ డాక్టర్ సత్య శివ సుందరి, కోశాధికారి శ్రీ సముద్రాల నాగరాజయ్య పాల్గొన్నారు.