
568views
పాక్ మరోసారి హద్దులు దాటింది. జమ్మూ కశ్మీర్లోని సరిహద్దుల్లో వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది. ఈ దాడుల్లో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. మరో ముగ్గురు పౌరులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో ఓ మహిళ కూడా ఉంది. భారత సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో పాక్కు చెందిన పలువురు జవాన్లు గాయపడినట్లు భారత సైన్యం ప్రకటించింది.





