
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతూనే ఉంది. కుల్గామ్ జిల్లాలోని చిన్ గామ్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రత బలగాలు ఎన్ కౌంటర్ చేసినట్టు కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీటర్ ద్వారా వెల్లడించారు. కుల్గామ్ లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందుకున్న జవాన్లు శుక్రవారం సాయంత్రం పోలీసులతో కలిసి కార్డన్ సెర్చ్ చేపట్టగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రత దళాలు ఎదురు కాల్పులు జరిపారు.
ఈ కాల్పులో ఇద్దరు ఉగ్రవాదులను హతమర్చారు. ఆ ప్రాంతాన్ని మొత్తం అధీనంలోకి తీసుకొని మిగతా ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అదే తరహాలో అక్టోబర్ 7వ తేదీన జమ్ముకశ్మీర్ లోని షోపియన్ జిల్లా సుగన్ జైనాపురా ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేయగా, సెప్టెంబర్ 7వ తేదీన అవంతిపురా జిల్లా సంబూర ప్రాంతంలో మరో ఇద్దరిని మట్టుబెట్టారు.





