
468views
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్రెడ్డి నియామకమయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జవహర్రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవలే తితిదే ఈవోగా ఉన్న అనిల్కుమార్ సింఘాల్ను వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.





