
626views
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం సింహవాహన సేవ జరగ్గా రాత్రి ముత్యపు పందిరి వాహనంపై శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. తిరుమలేశుడు కాళీయమర్ధనుడి అవతారంలో అభయ ప్రదానం చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతులైన స్వామివారికి ఆలయ కల్యాణ మండపంలోనే వాహన సేవ నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రాల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.






