News

దేశమంతా ఘనంగా జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

444views

74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. కోవిడ్ కారణంగా భారీ ఏర్పాట్లు జరుగకపోయినా అధికారికంగా వేడుకలు జరగాల్సిన అన్ని చోట్లా జరిగాయి, జరుగుతున్నాయి.

అలాగే పంద్రాగస్టు వేడుకలు ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులర్పించిన అనంతరం ప్రధాని మోడీ ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. ఎర్రకోట వద్ద భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఓవైపు కట్టుదిట్టమైన భద్రత మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు 4 వేల మంది అథితులు హాజరయ్యారు. అదే స్థాయిలో భద్రతా సిబ్బంది కూడా మోహరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.