
737views
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతూనే ఉన్నాయి. శ్రీనగర్ శివారులోని రణ్బీర్గఢ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గాలింపు చేపట్టిన భద్రతాదళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. గాలింపు చర్యల్లో ఉన్న భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా..భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఆ ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు.





