
697views
భారత జవాన్లు జమ్ము కాశ్మీర్ లోని కుల్గాం ప్రాంతంలో జరిపిన ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

జమ్ము కాశ్మీర్ లోని కుల్గాం ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టుగా సమాచారం అందుకున్న భారత జవాన్లు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఉన్నట్టుండి ఒక చోటు నుంచి ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భారత జవాన్లు వారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా, మరో ఉగ్రవాది పారిపోయాడు. ఆ మూడో ఉగ్రవాది కోసం జవాన్లు తీవ్రంగా గాలింపు జరుపుతున్నారు.





