News

News

పర్యావరణాన్ని కాపాడేందుకు భారత నౌకాదళం కృషి

ప్రపంచ పర్యావరణాన్ని కాపాడేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని భారత నౌకాదళం పునరుద్ఘాటించింది. బుధవారం ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా భూ పునరుద్ధరణ ఎడారీకరణ నిరోధం, కరువు సమయాల్లో పటిష్టంగా పనిచేసే వ్యవస్థలు అనే ఇతివృత్తానికి అనుగుణంగా తాము పని...
ArticlesNews

తోలు బొమ్మలకు జీవం

తోలు బొమ్మలు పేరెత్తగానే ఠక్కున గుర్తొచ్చేది శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని నిమ్మలకుంట గ్రామమే. ఇక్కడి కళాకారులు తోలుతో చేసిన కళాకృతులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో పలు దేశాలకు ఎగుమతులు అవుతున్నాయి. తోలుబొమ్మల కళాకారులు పలు భాషలు మాట్లాడడమే కాకుండా ఇతర దేశాల వారికి కూడా శిక్షణ ఇస్తున్నారంటే వీరి ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అనంత కీర్తిని అమెరికా దాకా తీసుకెళ్లిన నిమ్మలకుంట తోలుబొమ్మల కళాకారులు నిత్యం కొత్త బొమ్మల తయారీలో నిమగ్నమవుతున్నారు. ప్రస్తుతం ప్రజల జీవన ప్రమాణాలు రోజురోజుకూ మారుతున్నాయి. కాలానికి అనుగుణంగా తోలుబొమ్మలను తయారు చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ముఖ్యంగా ల్యాంప్‌సెట్స్‌, గోడలకు వేలాడదీసే బొమ్మలు, బ్యాగులు, గోడ గడియారాలు తదితర వాటిని తయారు చేస్తున్నారు. 80 కుటుంబాలకు ఉపాధి.. ధర్మవరం నుంచి పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారిలో నిమ్మలకుంట ఉంది....
News

హిమాలయాల్లో విషాదం, ముమ్మరంగా సహాయ చర్యలు

హిమాలయాల్లో ట్రెక్కింగ్‌ చేస్తూ ప్రమాదవశాత్తూ నలుగురు ప్రాణాలు వదిలారు. సహస్రతల్ ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు స్థానిక గైడ్‌లతో పాటు కర్ణాటకకు చెందిన 18 మంది ట్రెక్కర్లు, మహారాష్ట్రకు చెందిన ఒకరు 4,100-4,400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతల్...
ArticlesNews

శ్రీవారి అభిషేకానికి పాలు సేకరించేది ఇక్కడే..! రోజుకు ఎన్ని లీటర్లు అవసరమంటే..!

శ్రీవారికి వివిధ రకాలైన పూజలు, కైంకర్యాలు నిత్యం జరుగుతాయి. ఈ కైంకర్యాల్లో కల్తీలేని స్వచ్ఛమైన పదార్థాలనే వినియోగిస్తారు. వీటన్నింటిల్లోకెల్లా ముఖ్యమైనవి గోవుపాలు. శ్రీవారి కైంకర్యాలలో స్వచ్ఛమైన గోవు పాలు వినియోగించాల్సిందే. మన దేశంలో అందుబాటులో ఎన్నో రకాలసంకర జాతుల ఆవులు ఉన్నాయి. కానీ స్వామి వారి నైవేద్య నివేదనకు., స్వామి వారి కైంకర్యాలు నిమిత్తం టీటీడీ శ్రీవెంకటేశ్వర గో సంరక్షణ శాలను స్థాపించింది. తిరుపతి- చంద్రగిరి గిరి మార్గంలోని తుమ్మలగుంటకు సమీపంలో 1956వ సంవత్సరంలో ఈ గో సంరక్షణ శాలను టీటీడీ ప్రారంభించింది. స్వామి వారికీ నిత్య సేవలైన సుప్రభాతం సేవలో నవనీతం (వెన్న), తోమాల సేవలో (పాలు), ఇతర ప్రసాదాల్లో వినియోగించుకునే పాలను టీటీడీ ఈ గో సంరక్షణ శాలలో ఉత్పత్తి చేస్తుంది. రోజుకు సుమారు తొమ్మిది వందల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నారు. దేశవాళీ...
News

అయ్యో పాపం.. ఇంకేమి పుణ్యస్నానం..?

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలోని ఇంద్రపుష్కరిణి ఆధునికీకరణ ప్రతిపాదన అటకెక్కింది. నిధులు అందుబాటులో ఉన్నా.. పాలనా అనుమతులు పొందినా.. టెండర్లు సైతం ఖరారైనా వైకాపా అయిదేళ్ల పాలనలో పనులు ప్రారంభించలేకపోయింది. మూడేళ్లుగా అదిగో.. ఇదిగో అంటూ హడావుడి చేసి కాలం...
News

ఘనంగా అప్పన్న నిత్య కల్యాణం

సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో బుధవారం సింహాద్రినాథుడి నిత్య కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన, బాలభోగం సేవలు జరిపారు. దేవేరుల సమేతుడైన గోవిందరాజ స్వామిని పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి ఆలయ...
ArticlesNews

విభూతి మహిమతో పుణ్యలోకంగా మారిన కుంభీపాకం

శైవులు విభూతిని ధరిస్తుంటారు. ముఖానికి, చేతులకు, వక్షస్థలానికి విభూతి రేఖలను అలంకరించుకుంటూ ఉంటారు. విభూతి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైంది. దీనిని ధరించిన వారు నరకాల పాలు కాకుండా స్వామి రక్షిస్తాడని నమ్మకం. దేవీభాగవతం పదకొండో స్కందంలో త్రిపుండ్ర విభూతి విశిష్టతను తెలిపే...
News

ఎట్టకేలకు రోదశిలోకి సునీత విలియమ్స్

ఏళ్ల తరబడి జాప్యం తర్వాత బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక బుధవారం నింగిలోకి పయనమైంది. ఇందులో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు బయల్దేరారు. వీరు గురువారం ఈ కేంద్రాన్ని...
News

లక్ష్మణ ప్రాణ ప్రదాత ఆంజనేయుడు : శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ

రామ రావణ యుద్ధంలో లక్ష్మణ ప్రాణ ప్రదాత హనుమంతుడని తెలంగాణ రాష్ట్రం శంషాబాద్ కు చెందిన శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి ఉద్ఘాటించారు. హనుమత్‌ జయంతి ఉత్సవాలు బుధవారం తిరుమ‌ల‌లో ఘనంగా ముగిశాయి. నాదనీరాజనం, ఆకాశ‌గంగ‌, జ‌పాలి తీర్థంలో నిర్వ‌హించిన...
News

బయలు వీరభద్రస్వామికి ఆర్జిత పరోక్ష సేవ

శ్రీశైల మహక్షేత్రంలో బుధవారం అమావాస్య ఘడియలను పురస్కరించుకొని సాయంత్రం శ్రీశైలక్షేత్రపాలకుడైన బయలు వీరభద్ర స్వామికి పరోక్ష సేవగా విశేష అభిషేక పూజలు చేశారు. కార్యక్రమంలో మహాగణపతికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి వీరభద్రస్వామికి పంచామృతాల తోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మో దకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్ర స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. స్వామి పరోక్షసేవలో మొత్తం 16 మంది భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా రూ. 1,116 సేవారుసుమును చెల్లించి జరిపించుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు పాల్గొనేందుకు దేవస్థానం ఈ పరోక్షసేవల ద్వారా అవ కాశం కల్పించింది. ప్రతి నెల అమావాస్య రోజులలో బయలువీరభద్రస్వామికి జరిపే పరోక్ష సేవలో భక్తులు పాల్గొనవచ్చని దేవస్థానం ఈవో డి. పెద్దిరాజు తెలిపారు. దేవస్థానం వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ.శ్రీశైలదేవస్థానం. ఒఆర్‌జీ ద్వారా ఒక్కో పూజకు రూ. 1,116...
1 1,184 1,185 1,186 1,187 1,188 2,479
Page 1186 of 2479