News

News

రఘువీర్‌కు ‘వినూత్న రైతు’ అవార్డు

కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన అభ్యుదయ యువరైతు నందం రఘువీర్‌కు భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్‌ఐ) వినూత్న రైతు అవార్డు–2024ను అందజేసింది. న్యూఢిల్లీలో గురువారం జరిగిన జాతీయ కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే) మేళాలో ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌ కమ్‌ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఏకే సింగ్‌ ఈ అవార్డును రఘువీర్‌కు ప్రదానం చేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్‌ నుంచి అందుకున్న ఏకైక ఆదర్శ రైతుగా రఘువీర్‌ నిలిచారు. అంతరించిపోతున్న పురాతన ధాన్యపు సిరులను సంరక్షించి భవిష్యత్‌ తరాలకు అందించాలన్న సంకల్పంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలి దేశవ్యాప్తంగా పర్యటించి 257 రకాల పురాతన వరి విత్తనాలను సేకరించారు. వీటిలో 10కి పైగా జీఐ ట్యాగ్‌ కలిగిన వంగడాలు కూడా ఉన్నాయి. పెనమలూరులో తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో తాను సేకరించిన పురాతన విత్తనాలతో విత్తన సంరక్షణ చేస్తున్నారు. ఎనిమిది...
ArticlesNews

శబ్దం చేసిన ఆనంద తాండవం

శబ్దం అంటే… ధ్వని మాత్రమే కాదు. అంతరంగాన్ని కదిలించే అద్భుత సాధనం. శబ్దం అంటే.. ఉచ్చారణ విధానం మాత్రమే కాదు.. శ్వాస నియంత్రణ ద్వారా యోగసాధన చేయించే మార్గం. శబ్దం అనంతశక్తికి నిలయం. విశ్వ ప్రతిస్పందనకు కేంద్రం. సమస్త వాఙ్మయ ఆవిర్భావానికి శబ్దమే మూలాధారం. అందుకే శబ్దం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. అనంతమైన శబ్దశక్తితో శివుడినే కదిలించింది ‘శివతాండవ స్తోత్రం’. రాక్షస వంశంలో పుట్టినప్పటికీ అఖండమైన శివభక్తిని తనువులోని ప్రతి అణువులో నింపుకొన్నాడు రావణాసురుడు. ఇష్టదైవం పరమేశ్వరుడిని దర్శించుకోవాలనే సంకల్పంతో ఓ రోజు కైలాసానికి చేరుకున్నాడు. ఎంతసేపు నిరీక్షించినా శివుడు కరుణించలేదు. మొత్తంగా కైలాసపర్వతాన్నే పెకలిస్తానంటూ ఆవేశంతో ఊగిపోయాడు. అనుకున్నదే తడవుగా తన ఇరవై చేతులతో కైలాసపర్వతాన్ని పెళ్లగించటం ప్రారంభించాడు. విశ్వమంతా చేష్టలుడిగి చూసింది. పరమేశ్వరి కూడా విస్తుపోయింది. శివుడు మాత్రం ఏమీ పట్టనట్టు ఆనంద తాండవం...
News

చంద్రుని ఉపరితలంపై అద్భుతం..సోలార్ విండ్ అయాన్ల ఉనికి

చైనా ఇటీవల చంద్రునిపై పరిశోధనలకోసం దక్షిణ ధృవం పైకి పంపిన Change-6లోని ల్యాండర్ కొన్ని సోలార్ విండ్ అయాన్లను గుర్తించింది. వాస్తవానికి చంద్రుని దక్షిణ ధృవంపై మట్టి, రాళ్ల నమూనాను సేకరించి తిరిగి భూమికి పంపేందుకు ప్రయోగించారు. ఇది చంద్రునిపై మట్టి,...
News

జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర

దక్షిణ మధ్య రైల్వేలో భారత్ గౌరవ్ రైళ్లకు ప్రయాణికుల నుండి వచ్చిన భారీ స్పందనను స్పూర్తిగా తీసుకొని ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) సికింద్రాబాద్ నుండి మరో జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర టూరిస్ట్ సర్క్యూట్...
News

స్వర్ణదేవాలయంలో ఖలిస్థాన్‌ నినాదాలు

పంజాబ్‌లో మరోసారి వేర్పాటువాద ఖలిస్థాన్‌ అంశం తెరపైకి వచ్చింది. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో పాగా వేసిన తీవ్రవాదుల ఏరివేతకు ఉద్దేశించిన ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం అక్కడ భారీ కార్యక్రమం జరిగింది. దీనిలో పాల్గొన్న వివిధ సంస్థల కార్యకర్తలు...
NewsSeva

పర్యావరణ పరిరక్షణ పట్ల మక్కువ చాటిన సంఘమిత్ర చిన్నారులు

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంఘమిత్ర సేవా సమితి,నంద్యాల ఆధ్వర్యంలో సంఘమిత్ర చిన్నారులు, నంద్యాల నంది మండలం గా ప్రసిద్ది కెక్కడానికి ప్రతీకలైన నవనందులలో మొదటిదైన ప్రథమ నందీశ్వర స్వామి ఆవరణలో ఉన్న చెత్తా చెదారాన్ని, ముళ్ళు పొదలను శుభ్రం చేసి పర్యావరణం పట్ల తమ మక్కువను చాటడంతో పాటు, ఆ దేవ దేవుని పట్ల తమ భక్తిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులతో పాటు సంఘమిత్ర అధ్యక్షుడు నాగ సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సహకార్యదర్శి సుందర్ రావు, కార్యవర్గ సభ్యుడు రమణయ్య గౌడు, ఆవాసం ప్రముఖ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ భూతాన్ని మా ఇంట్లోనికి రానివ్వం అలాగే పర్యావరణ దినోత్సవం సందర్బంగా నంద్యాలలోని స్థానిక వాసవీ పారడైస్ అపార్ట్ మెంటులో ప్రకృతి పరిరక్షణపై అవగాహనా సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంగా ప్లాస్టిక్ నిరోధం, నిషేధం, పునరుత్పత్తి...
News

కొత్త ప్రభుత్వంతో చర్చలకు త్వరలో ఢిల్లీకి అమెరికా ప్రతినిధి

కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాల కోసం అమెరికా ప్రయత్నాలను మొదలుపెట్టింది. తమ దేశ జాతీయ భద్రతా సలహాదారు (NSA) జాక్‌ సలీవాన్‌ను భారత్‌ పంపాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని శ్వేతసౌధం ప్రకటించింది. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఫోన్‌ చేసిన సందర్భంగా...
News

అయోధ్య ఫలితంపై ‘రామాయణ్’ నటుడు

శ్రీరాముడి జన్మభూమి అయోధ్య క్షేత్రం ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ లోక్‌సభ స్థానంలో బిజెపి ఓటమిపాలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ కమలం అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ లల్లూ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ దళిత నేత అవధేశ్‌ ప్రసాద్‌ విజయం సాధించారు. ఈ ఫలితంపై ‘రామాయణ్‌’ ధారావాహికలోని లక్ష్మణ పాత్రధారి సునీల్‌ లాహ్రీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘ఈ ఎన్నికల ఫలితాలు (తీవ్రంగా నిరాశపర్చాయి. నాడు అరణ్యవాసం నుంచి తిరిగొచ్చిన తర్వాత అయోధ్యలో సీతాదేవిని శంకించిన విషయాన్ని మనం మర్చిపోయాం. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే కన్పిస్తున్నాయి. స్వయంగా దేవుడే ప్రత్యక్షమైనా వారు ఆయనను తిరస్కరిస్తారు. అయోధ్య ఎప్పుడూ నిజమైన రాజుకు ద్రోహం చేస్తూనే ఉంది. ఆనాడు సీతాదేవినే వదల్లేదు. అలాంటిది.. ఇప్పుడు శ్రీరాముడిని...
News

బర్డ్‌ఫ్లూ హెచ్‌5ఎన్‌2 వేరియంట్‌తో తొలి మరణం.. నిర్ధారించిన డబ్ల్యూహెచ్‌వో

బర్డ్‌ఫ్లూ హెచ్‌5ఎన్‌2 వేరియంట్‌తో మెక్సికోలో ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడింది. ఈ వైరస్‌ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. డయేరియా, వాంతుల లాంటి లక్షణాలతో...
News

అంతరిక్షంలో వెయ్యి రోజులు.. రష్యా వ్యోమగామి ఒలెగ్‌ రికార్డు

అంతరిక్షంలో వెయ్యి రోజుల పాటు గడిపి ఓ రష్యా వ్యోమగామి రికార్డు సృష్టించారు. ఒలెగ్‌ కొనొనెన్కో(59) 2008 నుంచి ఐదుసార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు. మంగళవారం నాటికి ఆయన వెయ్యి రోజుల పాటు అంతరిక్షంలోనే నివసించారు. దీంతో ప్రపంచంలోనే ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉన్న వ్యోమగామిగా ఒలెగ్‌ రికార్డు సృష్టించారని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్‌ బుధవారం ప్రకటించింది. 2024 సెప్టెంబర్‌ 23 వరకు ఆయన అంతరిక్షంలోనే ఉండనున్నారు. అప్పటికి 1,110 రోజులు అంతరిక్షంలో ఉన్నట్టు అవుతుంది. కాగా, ఒలెగ్‌ తర్వాత 878 రోజుల 11 గంటల 29 నిమిషాల 48 సెకన్ల పాటు అంతరిక్షంలో ఉన్న రికార్డును రష్యాకే చెందిన గెన్నడీ పడల్క 2015లో సృష్టించారు....
1 1,183 1,184 1,185 1,186 1,187 2,479
Page 1185 of 2479