రత్నగిరిపై నేడు నూతన ఆలయ 13వ వార్షికోత్సవం
భక్తవరదుడైన సత్యదేవుడు.. దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవీ సమేతుడై.. ఆ పరమేశ్వరునితో కలసి రత్నగిరిపై ఆలయంలో ఒకే పీఠంపై కొలువుతీరిన మహామహిమాన్విత క్షేత్రం అన్నవరం. రాష్ట్రం, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఈ దివ్య సన్నిధానానికి తరలి వస్తూంటారు....













