
మొజాంబిక్లోని టెటె నగర హిందూ సమాజం మే 8 నుంచి 10 వరకు హిందూ దేవాలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించింది. ఆధ్యాత్మిక ఉత్సాహం, వేద సంప్రదాయాల వైభవం మధ్య జరిగిన ఈ మహోత్సవం స్థానిక హిందూ సమాజానికి చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో వేద మంత్రోచ్చారణలు, యాగాలు, ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించారు. సుమారు 250 మంది భక్తులు, అతిథులు పాల్గొని దైవానుగ్రహం పొందారు.
ఈ వేడుకలకు టెటె ప్రావిన్స్ గవర్నర్ డొమింగోస్ వియోలా, ప్రథమ మహిళ, మొజాంబిక్లోని భారత హైకమిషన్ ప్రతినిధులు, వివిధ ప్రాంతాల హిందూ సమాజ నాయకులు హాజరయ్యారు.
వక్తలు తమ ప్రసంగాల్లో మొజాంబిక్ హిందూ సమాజం తరతరాలుగా సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతిని పరిరక్షిస్తూ వస్తున్న త్యాగాలను కొనియాడారు. భవిష్యత్ తరాలకు ధర్మం, సంస్కృతి, సద్గుణాలు, సేవాభావాన్ని అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.





