
222views
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రాలెన్నో ఉన్నాయి. అక్కడికి వెళ్లేందుకు సామాన్యులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ఆయా క్షేత్రాలకు నేరుగా చేరేందుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని అధిగమించేందుకు పర్యాటకశాఖ దృష్టిసారించింది. తక్కువ ఖర్చుతో అన్ని క్షేత్రాలను చుట్టి వచ్చేవిధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు పర్యాటకుల సందర్శనతో స్థానికంగా ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు.
సందర్శనకు ప్రతిపాదించిన క్షేత్రాలు
శింగరకొండ
సింగరాయకొండ
మాలకొండ
భైరవకోన
నెమలిగుండం
త్రిపురాంతకం
శ్రీశైలం





