
అయోధ్య రామ మందిర నిర్మాణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రామాలయ సముదాయంలోని కుబేర్ తిలా మార్గం వెంబడి జరుగుతున్న తవ్వకాలలో అద్భుతమైన పురావస్తు అవశేషాలు బయటపడ్డాయి. వీటిని గమనించిన ట్రస్ట్ నిర్వాకులు జాగ్రత్తగా బయటకు తీశారు. – రెండు సింహాలపై దేవత బొమ్మను వర్ణించే పురాతన అవశేషం అది. శతాబ్దాల నాటిదని నమ్ముతున్న ఈ శిల్పం, అయోధ్య పురాతన మూలాలను బలోపేతం చేస్తుంది.
రాముడి కోసం ఒక గొప్ప నిర్మాణాన్ని నిర్మించడమే కాకుండా, పురాతన నగరి అయోధ్య వారసత్వాన్ని పునరుద్ధరించడంతో పాటుగా నగరాన్ని రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్న విస్తృత ఆలయ ప్రణాళికలో భాగంగా కుబేర్ తిలా ప్రాంతాన్ని విస్తృతమైన అభివృద్ధి చేస్తున్నారు.
రామ జన్మభూమి క్యాంపస్లోని ప్రముఖ కొండ అయిన కుబేర్ తిలా చుట్టూ ఆధ్యాత్మిక బాటగా అభివృద్ధి చేయబడుతున్న ప్రాంతంలో పునాది పని చేస్తున్న సమయంలో ఈ అవశేషం కనుగొనబడింది. ఈ కళాఖండం ఒక స్త్రీ దేవత ప్రతిమను కలిగి ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు – బహుశా శక్తి లేదా వైష్ణవ సంప్రదాయాన్ని సూచిస్తుంది – రెండు వంగి ఉన్న సింహాలపై నిలబడి ఉంది. ఇది మధ్యయుగంనాటి హిందూ ఆలయ కళలో కనిపించే దైవిక బొమ్మల చిత్రణలతో సమానంగా ఉందని భావిస్తున్నారు. ఇది 6వ మరియు 9వ శతాబ్దాల మధ్య నాటిదని అంచనా వేయబడింది.
కేవలం ఇది మాత్రమే కాదు ఆలయం ప్రారంభించినప్పటి నుంచి అంటే 2020 నుండి, అనేక పురాతన ప్రాచీన విగ్రహాలు పాతకాలం నాటి బావులు. జంతువుల బొమ్మలు, విగ్రహాలు, చరణపాదుకలు ఇటుకలు, రాగి వస్తువులు ఇలా అనేక నిర్మాణాలు నలభై అడుగుల లోపే బయటపడ్డాయని రామజన్మభూమి ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. నిపుణులు ఈ కళాఖండాలను మౌర్య, శుంగ ,కుషాణ కాలాలకు చెందినవిగా భావిస్తున్నారు, ఇవి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటివి. అవి సామాన్యశకంపూర్వం 1680 నాటి సాంస్కృతిక అవశేషాలని అనుకుంటున్నారు, ఇది అయోధ్య నేల కింద 3,600 సంవత్సరాలకు పైగా చారిత్రక కొనసాగింపును సూచిస్తుందని ఒక అధికారి తెలిపారు. . ఈ తవ్వకాల్లో బయటపడిన వస్తువులన్నింటినీ.. తదుపరి నిర్మించబోయే మ్యూజియంలో ఏర్పాటు చేస్తామని రామజన్మభూమి ట్రస్ట్ చెబుతోంది.





