NewsProgramms

హైందవ శంఖారావంలో సభ అధ్యక్షులు గోకరాజు గంగరాజు అధ్యక్షోపన్యాసం:

305views
  • హిందూ ధర్మానికి మూలస్తంభాలు దేవాలయీలు. వాటి స్వయం ప్రతిపత్తి కోసం ఈ కార్యక్రమానికి విహెచ్‌పి పిలుపు మేరకు వచ్చిన హిందూ బంధువులకు స్వాగతం.
  • దేవాలయాల రక్షణకు ఎందరో పోరాటాలు, త్యాగాలు, బలిదానాలు చేసారు. వేల సంవత్సరాలుగా మన దేవాలయాలు దాడులకు, దోపిడులకు గురవుతున్నాయి.
  • స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళయినా పరిస్థితిలో మార్పు లేదు. దేవాలయాలను ప్రభుత్వాలు గుప్పెట్లో పెట్టుకున్నాయి. ఆలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చాయి.
  • దేవాలయాలు హిందువుల చేతిలో ఉంటే నిర్వహణ ధార్మికంగా ఉంటుంది. ఇటీవల దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంఘటనలు హిందువులను కలచివేస్తున్నాయి.
  • దేవాలయాలు హిందువుల జీవనాడి. వాటిని కాపాడుకోవాలి. దేవాలయాల్లో అన్యమతస్తులు, నాస్తికులను ఉద్యోగులుగా, ట్రస్టుబోర్డు సభ్యులుగా చేర్చకూడదు.
  • అలా జరగాలంటే దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కావాలి.ఈ హిందూ శంఖారావ సభ భారత్‌లో దేవాలయాల విముక్తి పోరాటానికి నాంది
    దేశంలో మొదటిసారి ఈ కార్యక్రమం జరుగుతోంది.
  • ఆలయాలకు స్వయంప్రతిపత్తి సాధించేందుకు నడుం కడదాం, దానికి పూజ్య స్వామీజీల ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాం.