గోమాత విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గోమాతను ‘‘రాజ్యమాత’’ గా ప్రభుత్వ ప్రకటించింది. సనాతన హిందూ సంప్రదాయంలో గోమాతకు అత్యంత ప్రాధాన్యత వుందని, అత్యంత పవిత్రంగా చూసే దృష్టికోణం కూడా వుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దేశ ఆధ్యాత్మిక, శాస్త్రీయ, ఇతర చరిత్రలను తీసుకున్నా… గోమాతకు అత్యంత ప్రాధాన్యం వుందని, పురాతన కాలం నుంచీ గోవును పూజిస్తున్నామని పేర్కొంది. మరోవైపు దీనిపై మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ సంతకం కూడా చేశారు.
దేశవాళీ ఆవుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుండటంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయంలో ఆవు పేడ ప్రాధాన్యతను కూడా ఆ ప్రకటనలో వివరించింది. ఆవు పాలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తుందని, ఆవు మూత్రం కూడా అనేక వ్యాధులను నయం చేస్తుందని, గోమాత ఉత్పత్తులతో మానవులు పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నట్టు వివరించారు. మనుషుని జీవితంలో గోవు ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఇది ప్రాచీనం నుంచి వస్తోందని పేర్కొన్నారు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాముఖ్యం వుందని, కామధేనువు అని కూడా పిలుచుకుంటామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ జాతులు ఉన్నప్పటికీ, దేశవాళీ ఆవుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతున్నదని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
మరాఠ్వాడాలోని దేవ్రి మరియు లాల్కనారి మరియు ఉత్తర మహారాష్ట్రలోని డాంగి మరియు షావదాభట్ వంటి అనేక రకాల దేశీయ జాతులకు మహారాష్ట్ర నిలయం. అయితే, ఈ దేశవాళీ ఆవులు వేగంగా క్షీణించడంపై ప్రభుత్వం చాలా సార్లు ఆందోళన వ్యక్తం చేసింది.
24
You Might Also Like
‘దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పగించాలి’
హిందూ దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు కోరారు. విశ్వహిందూ పరిషత్ అన్ని ధార్మిక వ్యాపార, కుల సంఘాల ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ నిరసన...
కాంచీపురంలోని శివపార్వతుల విగ్రహాలపై తెలుగు శాసనం
కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయంలోని శివపార్వతుల విగ్రహాలపై తెలుగుశాసనం బయటపడింది. శివపార్వతులు, స్కంధ విగ్రహాల పీఠంపై ఈ శాసనం లిఖించి ఉంది. ఇది 18వ శతాబ్దానికి చెందినదని...
సోమనాథ్ మందిరం దగ్గర అక్రమ మసీదు, దర్గా, శ్మశానం తొలగింపు
7
గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో సెప్టెంబర్ 28న ఒక మసీదు, ఒక దర్గా, ఒక శ్మశానాన్ని తొలగించివేసారు. ముందస్తు అనుమతి లేకుండా అటువంటి పనులు చేయకూడదంటూ ఇటీవల...
ఆర్ఎస్ఎస్ సాంఘిక్ను అడ్డుకోడానికి కేరళ పోలీసుల ప్రయత్నం
45
కేరళలోని తిరువనంతపురంలో కల్లిక్కట్ గ్రామ పంచాయతీ స్టేడియంలో ఆదివారం నాడు సాంఘిక్ నిర్వహించుకోడానికి ఆర్ఎస్ఎస్ ఏర్పాట్లు చేసుకుంది. సాంఘిక్ అంటే ఒక మండలం, తాలూకా, జిల్లా లేదా...
దేవుళ్ళను రాజకీయం చేయకండి: లడ్డూ వ్యవహారంలో సుప్రీం వ్యాఖ్య
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం మీద సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను సవాల్ చేస్తూ,...
ఘర్ వాపసీ : తిరిగి హిందూమతంలోకి 100 మంది
37
ఛత్తీస్ గఢ్ లో హిందూ సమాజానికి బలం చేకూరింది. 22 కుటుంబాలకు చెందిన 100 మంది తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్...