News

తిరుపతిలో తెలుగు భాషా సభలు

34views

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం-ప్రాచ్య పరిశోధనా సంస్థ(ఓఆర్‌ఐ) – తెలుగు సంపద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు భాషా సభలు జరగనున్నాయి. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వీటిని నిర్వహించనున్నారు. నిర్వహణ ఏర్పాట్లపై వీసీ అప్పారావుతో తెలుగు విభాగాధిపతి రాజేశ్వరమ్మ, ఓఆర్‌ఐ సంచాలకులు వెంకటేశ్వర్లు, తెలుగు సంపద సంస్థ ప్రధాన సలహాదారు రేమిళ్లమూర్తి చర్చించారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సభల్లో పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధనా సంస్థలకు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొంటారని వారు తెలిపారు. తెలుగు సాహిత్యంపై నిపుణులతో ప్రసంగాలు, పరిశోధనా పత్రాల సమర్పణ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.