News

సింహాచలం ప్రసాదానికి విశాఖ డెయిరీ నెయ్యి

16views

సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో లడ్డూల తయారీ, దీపారాధనతో సహా ఇతర అవసరాలకు తాత్కాలికంగా విశాఖ డెయిరీ నెయ్యి కొనుగోలు చేయాలని దేవాదాయ అధికారులు నిర్ణయించారు. దేవస్థానం స్టోర్‌లో ఈ నెల 21న తనిఖీ నిర్వహించిన ఫుడ్‌ సేఫ్టీ అధికారులు నెయ్యిని సీజ్‌ చేశారు. ప్రస్తుతం రోజుకు 25 వేల నుంచి 30 వేల లడ్డూలు విక్రయిస్తున్నారు. సోమవారం వంద డబ్బాల విశాఖ డెయిరీ నెయ్యి (1,500 కేజీలు) దేవస్థానానికి రానుంది.