దసరా ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న ఏర్పాట్లను విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్బాబు శనివారం పరిశీలించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో అక్టోబర్ మూడు నుంచి 12వ తేదీ వరకు దసరా ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న పనులు, భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను సీపీ తన బృందంతో పరిశీలించారు. ఘాట్రోడ్డు, ఓం టర్నింగ్, క్యూలైన్లు, అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించే మార్గంతో పాటు భక్తులకు బయటకు వచ్చే మార్గాలను తనిఖీ చేశారు. ఆర్జిత సేవలు, ఉభయదాతల కోసం ఏర్పాటు చేసే క్యూలైన్లను పరిశీలించారు. గతంలో ఉభయదాతలకు కలిగిన అసౌకర్యం గురించి పోలీసు అధికారులు సీపీ దృష్టికి తీసుకువెళ్లగా, ఈ దఫా అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం సీపీ రాజశేఖర్బాబు అమ్మవారిని దర్శించుకున్నారు. సీపీ వెంట డీసీపీ గౌతమిశాలి, దుర్గగుడి ఈఈ కోటేశ్వరరావు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
43
You Might Also Like
హిందూ ఆలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలి : వీహెచ్పీ
18
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి బాధ్యులైన దోషులను చట్టపరంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్...
‘‘పథ సంచలన్’’ కి అనుమతి ఇవ్వండి : హైకోర్టులో ఆర్.ఎస్.ఎస్. పిటిషన్
28
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ నిర్వహించే పథ సంచలన్ (రూట్ మార్చ్)కి అనుమతి కావాలంటూ ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను,...
ఎమర్జెన్సీ సినిమాపై కోపం ఎందుకు?
1975 ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీని ఎందుకు విధించినట్లు? ఎమర్జెన్సీ కాలంలో పత్రికలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాస్వామ్యవాదులు...
శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం.. సుప్రీంకోర్టులో పిటిషన్
26
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. లడ్డూ తయారీకి జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు కలకలం...
తిరుపతికి పంపే నెయ్యి వాహనాలకు జీపీఎస్
27
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో లడ్డూల తయారీ కోసం పంపే నందిని నెయ్యి వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక పాల సమాఖ్య (కేఎంఎఫ్) నిర్ణయించింది....
శ్రీవారి లడ్డూ పై టీటీడీ కీలక ప్రకటన
30
శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేసినట్లు తితిదే ఈవో శ్యామలరావు తెలిపారు. ఆలయంలో శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాల...