News

కడపలో హిందూ ఐక్యతా ప్రదర్శన

27views

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆదివారం కడపలో హిందూ ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హిందువులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం ఎన్జీవో కాలనీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరంలోని పలు కూడళ్ల మీదుగా ఏడు రోడ్ల కూడలి వరకు సాగింది. అక్కడ నిరసనలు తెలిపి బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పలువురు హిందూ, ధార్మిక సంఘం నాయకులు ప్రసంగిస్తూ బంగ్లాదేశ్‌లో హిందూ మహిళలు, చిన్నారులు, యువకులపై దాడులు చేస్తున్నారని, ఆలయాలను ధ్వంసం చేస్తూ పాశవిక ఆనందాన్ని పొందడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. దీనికి కారణమైన వారిని అక్కడి పాలకులు కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.