News

జయహో.. భారత్‌

56views

ఒలింపిక్స్‌లో క్రీడాకారుల స్ఫూర్తిని ప్రతిబింబించేలా తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఓ నర్సరీ నిర్వాహకులు స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు చేశారు. నర్సరీలోని వివిధ రకాల మొక్కలతో ఒలింపిక్స్‌ చిహ్నం, త్రివర్ణ పతాకం చేబూని ఉత్సాహంగా ఉన్న ఓ వ్యక్తి బొమ్మలను తీర్చిదిద్దారు. చిక్కటి రంగుల చక్కటి చిత్తరువు పచ్చటి భారతానికి ప్రతీకాత్మకంగా ఉంది కదూ!