బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా నిరసనకారులు విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనకారులు చేపట్టిన నిరసన ర్యాలీలు హింసాత్మకంగా మారడంతో భారీ మొత్తంలో ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది. ఇప్పటివరకు దాదాపు 400 మంది వరకు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె దేశం విడిచిపెట్టి భారత్లో తల దాచుకున్నారు. ఆమె దేశం విడిచి వెళ్లిన తర్వాతి రోజు నుంచి బంగ్లాదేశ్లో హిందువులు సహా మైనారిటీలపై దాడులు తీవ్రమయ్యాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఇళ్లను దోచుకోవడం, నిప్పు పెట్టడం చేస్తున్నారు. తాజాగా ఢాకాలో హిందూ సంగీతకారుడు, గీత రచయిత, గాయకుడు అయిన రాహుల్ ఆనంద ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఢాకాలోని ధన్మొండి 32లో ఉన్న ఆయన నివాసంపై ఒక్కసారిగా ఓ గుంపు దాడి చేసి విధ్వంసం సృష్టించింది. ఈ దాడి నుంచి ఆనంద, అతని భార్య, కుమారుడు ఎలాంటి ప్రమాదం లేకుండా తప్పించుకున్నారు. ఇంటికి నిప్పు పెట్టడానికి ముందు నిరసనకారులు మూడు వేలకుపైగా సంగీత వాయిద్యాలను తగలబెట్టేశారు. అంతటితో ఆగకుండా ఇంట్లోంచి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.
74
You Might Also Like
పాక్లో షియా, సున్నీ ముస్లింల పోరు.. 25 మంది మృతి
10
పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్...
మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే
10
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ...
స్వచ్ఛ భారత్ లో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన నరసాపురం మహిళ
14
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి వార్డులోని సత్యనారాయణమ్మ పరిశుభ్రత విషయంలో చేసిన ప్రయత్నాలు స్వచ్ఛ భారత్ దృష్టిని ఆకర్షించాయి. దివ్యాంగురాలైన ఆ మత్స్యకార మహిళ ఇద్దరు...
ప్రజ్ఞాన్ రోవర్కు చిక్కిన భారీ పురాతన బిలం
19
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...
28న ఆధ్యాత్మిక అవగాహన సదస్సు
28
అన్నమయ్య జిల్లాలోని దేవాలయాల పాలకవర్గ చైర్మన్లు, ఇన్స్పెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఆలయ ఉద్యోగులు, పూజారులకు ఈ నెల 28వ తేదీన ఆధ్యాత్మిక అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా...
ఇప్పిలిలో పురాతన శిలాశాసనం
26
శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పిలి గ్రామంలో పురాతన శిలాశాసనం బయల్పడింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పర్యాటకాధికారి కె.నారాయణరావు అక్కడకు చేరుకున్నారు. ఈ వివరాలను పురావస్తుశాఖ అధికారులకు అందజేశారు....