News

ఢాకాలో భారత స్వాతంత్ర్య సమరయోధుడి విగ్రహం ధ్వంసం

52views

బంగ్లాదేశ్‌లో రాడికల్ ఇస్లామిస్టులు చెలరేగిపోతున్నారు. రిజర్వేషన్ల ఆందోళనల ముసుగులో హిందువులపై అమానవీయ దురాగాతాలకు పాల్పడుతున్నారు. వారి ఆస్తులకు నిప్పుపెడుతున్నారు. హిందువులపై వారి దర్శనీయ స్థలాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు. హిందువులపై జరిగిన దాడుల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. హిందువులే లక్ష్యంగా దాడులకు పాల్పడాలని జమాతే ఇస్లామీ పార్టీ ప్రజల్ని రెచ్చగొడుతోంది. తాజాగా ఇండియన్ కల్చరల్ సెంటర్‌ను ధ్వంసం చేసిన రాడికల్స్ ఢాకాలోని తీరత్‌సింగ్ సయీమ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ విగ్రహాన్ని భారత ప్రభుత్వ సహకారంతో ఇటీవలే అక్కడ నెలకొల్పారు. ఖాసీ పర్వత ప్రాంతానికి చెందిన తీరత్ సింగ్ సయీమ్ అవిభక్త భారతదేశపు స్వాతంత్ర్య సమరయోధుడు. తీరత్ సింగ్ విగ్రహ ధ్వంసం పై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.