కాకినాడ జిల్లా ఏపీఎస్ ఆర్టీసీ రావులపాలెం డిపో నుంచి రామేశ్వరం తీర్థ యాత్రల ప్రత్యేక బస్ సర్వీస్ ఈ నెల 17న బయలు దేరుతుందని ఆ డిపో మేనేజర్ కేడీఎంఎస్ కుమార్ తెలిపారు. శనివారం కొత్తపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామేశ్వరం తీర్థయాత్రల విశిష్టత, దర్శనం నిమిత్తం భక్తుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని పుష్ బ్యాక్ 2 ప్లస్ 2 సిటింగ్ గల సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేశామన్నారు. 17న రావులపాలెం కాంప్లెక్స్లో బస్సు బయలుదేరి 24న తిరిగి వస్తుందన్నారు. ఏడు రోజుల తీర్థయాత్రలో కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, శ్రీరంగం, జంబుకేశ్వరం, పళని, కోయంబత్తూరు (ఈశా ఫౌండేషన్), మధురై, రామేశ్వరం, ధనుష్కోడి, తంజావూరు, కాంచిపురం, శ్రీకాళహస్తి, విజయవాడ దేవాలయాల దర్శనం చేయిస్తారన్నారు. టిక్కెట్ చార్జి ఒకరికి రూ.8,500 (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి టిఫిన్తో సహా) ఉంటుంది. రూమ్ అద్దెలు యాత్రికులే భరించాలని తెలిపారు. యాత్రలకు వచ్చే ప్రయాణికులు అసిస్టెంట్ మేనేజర్ 73829 11871, ఆర్ఎస్ రావు 73829 12398, వీరభద్రరావు 73829 12400 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
40
You Might Also Like
యూపీలో హిందూ వ్యాపారులపై ముస్లింల దాడి
22
యూపీలోని సరఫా బజార్ లో శుక్రవారం హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఓ దుకాణం విషయంలో జైనులపై ముస్లిం వ్యాపారులు దాడి చేశారు .దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి....
ఇంట్లో బైబిలే చదువుతా… జగన్
18
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తానేంటో చెప్పేశారు. ఇంట్లో తాను బైబిల్ చదువుతానని బహిరంగంగానే ప్రకటించారు. ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న సందర్భంగా...
ఉత్సాహంగా తీజ్ ఉత్సవాలు
22
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్ద తండా లో తీజ్ ఉత్సవాలు ఉత్సాహంగా సా గాయి. ఈ ఉత్సవాలను 11రోజుల పాటు నిర్వహించారు. చివరి రోజు...
వైద్యసహాయం పేరిట మతమార్పిడి ప్రయత్నాలను అడ్డుకున్న ప్రజలు
14
బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగహా పట్టణంలో క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఆ సమావేశంలో వారు వైద్య సహాయం...
1న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
30
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో 1వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం...
శ్రీకాకుళం జిల్లాలో ‘గో’వేదన
32
శ్రీకాకుళం జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కోటబొమ్మాళి మండలం నారాయణవలస సంత నుంచి కబేళాలకు ఈ పశువుల తరలింపు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది....