73
వృద్ధుల దర్శనంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని వీటిని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం -టిటిడి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. రోజూ వెయ్యి మంది వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం కల్పిస్తున్నామని తెలిపింది. మూడు నెలల ముందే ప్రతినెలా 23న ఆన్లైన్ కోటా విడుదల చేస్తున్నామని పేర్కొంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారని వెల్లడించింది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.