News

ప్రతీ రోజు రాముడ్ని దర్శించే వారికి ప్రత్యేక పాసులు ఇస్తాం : అయోధ్య ట్రస్ట్ ప్రకటన

60views

అయోధ్య శ్రీరాముడి దర్శనాన్ని రోజూ దర్శించాలనుకునే వారికి అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్టు శుభవార్త చెప్పింది. రోజూ శ్రీరాముడ్ని దర్శించాలనుకునే వారికి, సాధువులకు ప్రత్యేక పాసులు జారీ చేస్తామని ప్రకటించింది. ఈ పాసులు ఆరు నెలల పాటు చెల్లుతాయి. ఆరు నెలలు ముగియగానే.. వీటిని మళ్లీ రెన్యువల్‌ చేసుకునే సౌలభ్యం కూడా వుంటుందని తెలిపారు. అయితే.. ఇలాంటి ప్రత్యేక పాసు సౌకర్యం కలిగిన వారు డీ`1 గేటు ద్వారా మాత్రమే ప్రవేశించాలని సూచించారు. ఈ మేరకు తీర్థక్షేత్ర ట్రస్టు సోషల్‌ మీడియాలో ప్రకటన చేసింది. ఈ పాసు కావల్సిన వారు ట్రస్టు కార్యాలయంలో గానీ… యాత్రీకుల సేవా కేంద్రాన్ని గానీ సంప్రదించవచ్చు.

అయితే.. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్‌ కార్డు మాత్రం తప్పనిసరి. ఈ పాసు కావాల్సిన వారు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ట్రస్టు పేర్కొంది. అయితే.. ఇలా రోజూ దర్శనం చేసుకునే భక్తులు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలని, మొబైల్‌ ఫోన్లు, పూజా సామాగ్రి, ప్రసాదాలు మొదలైన వాటితో అనుమతించమని, డీ`1 గేటు ద్వారా మాత్రమే ప్రవేశించాలని ట్రస్ట్‌ స్పష్టం చేసింది. దర్శనానికి వచ్చిన సమయంలో అక్కడ వుండే భద్రతా సిబ్బందికి ఈ పాసులు చూపించాలి.