78
ఈనెల 21న పౌర్ణమి సందర్భంగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించినట్లు గుంటూరు-2 డిపో మేనేజర్ అబ్దుల్ సలాం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ బస్టాండ్ నుంచి 19న రాత్రి 9.15 గంటలకు బయల్దేరి 20వ తేదీన శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శించుకొని అదే రోజు రాత్రి అక్కడే బసచేసి 21న పౌర్ణమి రోజున అరుణాచలంనకు చేరుకుంటుందన్నారు. అదేరోజు సాయంత్రం బయల్దేరి 22వ తేదీన ఉదయం 6.30 గంటలకు గుంటూరు బస్టాండ్కు చేరుకుంటుందన్నారు. 96164 బస్సు సర్వీస్ నెంబర్కు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఒక్కోఛార్జీ రూ.2420 మాత్రమేనని పేర్కొన్నారు. అదనపు సమాచారం కోసం 73828 97459 సంప్రదించాలని కోరారు.