హనుమజ్జయంతి జిల్లాలో వైభవంగా జరిగింది. రామాలయాలు, ఆంజనేయ స్వామి విగ్రహాల వద్ద పెద్దఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామికి ప్రీతిపాత్రమైన తమలపాకులు, వివిధ రకాల పండ్లను నైవేధ్యంగా సమర్పించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు సింధూరం అందించారు. భక్తులు ఆంజనేయ స్వామి చిత్రంతో ఉన్న జెండాలను వాహనాలకు అమర్చుకుని జై..భజరంగ్ అంటూ నినాదాలు చేశారు. విజయనగరంలో హిందూ ధర్మ రక్షసమితి ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. విగ్రహాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అలాగే విగ్రహాన్ని ఊరేగించే వాహనాన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ర్యాలీలో యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. వీరి ప్రదర్శనతో నగరం కాసాయరంగు పులుముకుంది. జై హనుమాన్, ఆంజనేయ, అంజినీపుత్ర, జై భజరంగ్ అంటూ నినాదాలు చేస్తూ శోభాయాత్ర కొనసాగించారు. కొత్తపేట కొత్తకోవెలలో హనుమాన్ విగ్రహాలకు హిందూధర్మ రక్షసమితి ప్రతినిధులు పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం కోట నుంచి ర్యాలీ చేపట్టారు. మూడులాంతర్లు, గంటస్తంభం, కన్యాకాపరమేశ్వరి ఆలయం, రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్ మీదుగా తిరిగి కోట వరకు హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. స్కేటింగ్ విద్యార్థులు హనుమాన్ జెండాలు పట్టుకుని చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
8k
You Might Also Like
‘అహ్మద్కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్పై పోలీసులకు ఫిర్యాదు
39
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో మూడవ తరగతి చదువుతున్న ఓ బాలిక తండ్రి ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ఓ పాఠ్యాంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఓ లెసన్ను ‘లవ్...
కేదార్నాథ్ నడక దారిలో కుంగిన భూమి
40
కేదార్నాథ్ యాత్ర శనివారం తాత్కాలికంగా నిలిచిపోయింది. నడకదారిలోని జంగిల్ చట్టి ఆకస్మికంగా 10-15 మీటర్ల మేర భూమి కుంగి భారీ గొయ్యి ఏర్పడడంతో అధికార్లు యాత్రను నిలిపివేశారు....
రాష్ట్రంలో ‘ఆపరేషన్ ఘీ’.. అన్ని ఆలయాల్లో క్వాలిటీ తనిఖీలు.
38
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు, నివేదికలు…ఏపీలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా కలకలం రేపుతున్నాయి. ఈ ఎఫెక్ట్…...
ఆర్టికల్ 370ని ఏ శక్తీ తిరిగి తీసుకురాలేదు: ఫరూక్ అబ్దుల్లాపై అమిత్ షా విమర్శలు
33
జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సహా ఇతర పార్టీలు...
ఫిష్ ప్లేట్లు తొలగించి రైలు ప్రమాదానికి కుట్ర
52
గుజరాత్లో రైలును పట్టాలు తప్పించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ప్రయత్నం లైన్మ్యాన్ అప్రమత్తత కారణంగా విఫలమయింది. శనివారం వేకువజామున సూరత్ జిల్లాలోని కోసంబ- కిమ్...
జగన్ తాడేపల్లి నివాసం వద్ద యువ మోర్చా నిరసన
31
వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయ్యినట్టు నిర్ధారణ కావడంతో స్వామివారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు...