News

తెలంగాణలో పుణ్యక్షేత్ర సందర్శనకు ప్రత్యేక బస్ సర్వీస్

73views

తెలంగాణ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు భక్తుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి నరసింహస్వామి దేవాలయం, చిలుకూరి బాలాజీ దేవాలయం, ముచ్చింతల రామానుజక్షేత్రం సందర్శించవచ్చని పేర్కొన్నారు. జూన్ 1వ తేదీ శని వారం రాత్రి 9 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి సోమవారం ఉదయం దేవాలయాలు దర్శించుకుని తిరిగి చేరుకుంటుందన్నారు. ఒక్కొక్కరికి రూ.1600 చార్జిగా నిర్ణయించారు. రిజర్వేషన్ సౌకర్యం ఉందని ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని డిపో మేనేజర్ పెద్దిరాజు తెలిపారు. మరిన్ని వివరాలకు 8808807789 నంబర్ లో సంప్రదిం చాలని ఆయన సూచించారు.