రాయదుర్గంలో ప్రతి ఏటా బాలికతో ప్రసన్న వేంకటరమణుడి కల్యాణోత్సవాన్ని జరపటం అరవా తెగకు ఆనవాయితీగా వస్తోంది. పట్టణంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో పురప్రముఖులు, దేవాదాయశాఖ అధికారులు, భక్తుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పట్టణానికి చెందిన రమేష్, జయమ్మల కుమార్తె మౌనిక(10)తో శ్రీవారి నిశ్చితార్థం చేశారు. ఈనెల 25న ఉదయం 11గంటలకు పట్టణంలోని స్వామివారి ఆలయంలో ప్రజల సమక్షంలో శ్రీదేవి, భూదేవిలతో పాటు బాలికతోనూ వేంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహంతో కల్యాణం చేయనున్నారు. స్వామివారి తరఫున ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలాక్షిరెడ్డి, దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా కుమార్తె ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అలంకరించిన మౌనికను తల్లిదండ్రులు, బంధువులతో ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకువచ్చి, అర్చకులు బాలికతో వేంకటరమణుడి(కలశం)తో నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్ళారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు శివప్ప, కార్యదర్శి నాగప్ప, ఆసంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
285views
You Might Also Like
రూ. 200 కోట్లతో భద్రాచలం ఆలయం అభివృద్ధి పనుల ప్రారంభం
8
భద్రాద్రి ఆలయ మాస్టర్ ప్లాన్ కల సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. భద్రాద్రి క్షేత్ర అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం...
AI సాంకేతికతతో హిందూ ధర్మాన్ని కించపరుస్తున్న క్రైస్తవ సంఘాలు
31
ప్రస్తుతం నడుస్తోంది AI యుగం. AI సాంకేతికత సమాచారం కోసం వినియోగిస్తే బాగుంటుంది. కానీ.. రాయ్ పూర్ లో మాత్రం సాంకేతికతను ఉపయోగించి, హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారు....
తిరుమలలో ఆధ్యాత్మిక వనాలను విరివిగా అభివృద్ధి చేయాలి
42
శ్రీవేంకటేశ్వరస్వామివారి క్షేత్రమైన తిరుమలలో ఆధ్యాత్మిక వనాలు, ఔషధ వనాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి (ఈవో) సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు....
శతాబ్దాల సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. రాజస్థాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం
37
శతాబ్దాల కాలంగా వస్తున్న కట్టుబాట్లను, పురుషాధిక్య రాజకుటుంబ సంప్రదాయాలను పక్కన పెడుతూ రాజస్థాన్ చరిత్రలో ఒక అద్భుతమైన సామాజిక మార్పు చోటుచేసుకుంది. రాజ్పుత్ సంప్రదాయాల ప్రకారం కేవలం...
రామనాథపురంలో శిలాయుగం ఆనవాళ్లు
41
తమిళనాడులోని రామనాథపురంలో పురాతన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సుమారు 5,000 ఏళ్ల నాటి సమాధి మట్టి కుండలు, ప్రత్యేక చిహ్నాలను పరిశోధకులు గుర్తించారు. ఇవి మెగాలిథిక్...
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి సప్తనదీ జలాలతో మహాభిషేకం
44
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. భక్తిశ్రద్ధల మధ్య స్వామివారికి సప్త పుణ్యనదుల జలాలతో...





