రాయదుర్గంలో ప్రతి ఏటా బాలికతో ప్రసన్న వేంకటరమణుడి కల్యాణోత్సవాన్ని జరపటం అరవా తెగకు ఆనవాయితీగా వస్తోంది. పట్టణంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో పురప్రముఖులు, దేవాదాయశాఖ అధికారులు, భక్తుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పట్టణానికి చెందిన రమేష్, జయమ్మల కుమార్తె మౌనిక(10)తో శ్రీవారి నిశ్చితార్థం చేశారు. ఈనెల 25న ఉదయం 11గంటలకు పట్టణంలోని స్వామివారి ఆలయంలో ప్రజల సమక్షంలో శ్రీదేవి, భూదేవిలతో పాటు బాలికతోనూ వేంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహంతో కల్యాణం చేయనున్నారు. స్వామివారి తరఫున ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలాక్షిరెడ్డి, దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మేళతాళాలతో ఊరేగింపుగా కుమార్తె ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అలంకరించిన మౌనికను తల్లిదండ్రులు, బంధువులతో ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకువచ్చి, అర్చకులు బాలికతో వేంకటరమణుడి(కలశం)తో నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్ళారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు శివప్ప, కార్యదర్శి నాగప్ప, ఆసంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
76
You Might Also Like
కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దుశ్చర్య
36
అమెరికాలో మరో మారు హిందూ ఆలయంపై దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసి, ఆలయానికి సంబంధించిన నీటి సరఫరా...
మణిపూర్ లోని శివాలయానికి నిప్పు.. వారంలోనే రెండోసారి
34
మణిపూర్ లోని సేనాపి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలోని చొరబడి మరీ శివాలయానికి నిప్పంటించారు. దీంతో ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది....
దేశంలో సనాతన హిందూ బోర్డ్ ఏర్పాటు చేయండి : బాగేశ్వర్ బాబా
50
బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతులు ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ బాబా) భారత ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ వుంచారు. ‘సనాతన్ హిందూ బోర్డు’’ ను దేశంలో ఏర్పాటు చేయాలని...
భక్తులలో భగవంతుని దర్శిస్తూ సేవలందించండి – అదనపు ఈవో
28
టీటీడీ ఉద్యోగులందరూ భక్తులలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శిస్తూ వారికి అత్యంత అంకితభావంతో సేవలు అందించాలని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమల...
రైల్వే ట్రాకులపై కుట్రల కేసు ఎన్ఐఏ తో దర్యాప్తు
24
రైల్వే ప్రమాదాలకు కుట్రలు పన్నుతున్న వారికి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాలకు యత్నిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. రైల్వే పట్టాలపై కుట్రపూరితంగా...
హోటళ్లలో యజమానుల పేర్లు ప్రదర్శించాలి
40
తిరుపతి వెంకన్న ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశాలోని...