తిరుపతి గంగమ్మ ఆలయం భక్తులతో పోటెత్తింది. మంగళవారం గంగ జాతర కావడంతో పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు భక్తులు. ఆలయ ఆవరణలో పొంగళ్ళు పెడుతూ అమ్మవారిని సేవిస్తున్నారు భక్తులు. వివిధ రకాల వేషధారణతో గంగమ్మకు మొక్కులు సమర్పించుకుంటున్నారు భక్తులు. అలాగే సున్నపుకుండలు నెత్తిపై పెట్టుకుని ఆలయం చుట్టు తిరుగుతున్నారు భక్తులు. భక్తుల మధ్య తోపులాటలు జరుగకుండా ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు చేశారు. గంగమ్మ తల్లిని శక్తి స్వరూపిణిగా అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తిరుపతి గంగమ్మ జాతరకు వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుపతి గంగమ్మకు పట్టువస్త్రాలను సమర్పించారు విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుటుంబ సమేతంగా గంగమ్మ తల్లిని మంత్రి దర్శించుకున్నారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్ధించినట్లు మంత్రి పెద్దిరెడ్డి పాత్రికేయులకు తెలిపారు.
136
You Might Also Like
భారత రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆద్యులు సతీష్ ధవన్
( సెప్టెంబర్ 25 - సతీష్ ధవన్ జయంతి ) భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఫ్రొఫెసర్ సతీష్ ధవన్ది సువర్ణ అధ్యాయం. ఎందుకుంటే ఆయన నెలకు ఒక్క...
మూత్రం, ఉమ్మి కలిపి అమ్మేవారిని బహిష్కరించండి : పంచాయితీ నిర్ణయం
26
యూరిన్ జిహాద్, ఉమ్మి జిహాద్ కి వ్యతిరేకంగా ఘజియాబాద్ లో హిందువులంతా సంఘటితమయ్యారు. ఉమ్మితో, మూత్రంతో ఆహారం, పానీయాలను కలుషితం చేసే వ్యక్తులను ఆర్థికంగా, సామాజికంగా బహిష్కరించాలని...
పళని పంచామృతంపై తమిళ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
31
పళని ఆలయంలో భక్తులకు అందజేసే పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతున్నారని ఆరోపించిన తమిళ దర్శకుడు మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం చెన్నైలో అరెస్ట్...
సంజయ రాయబారం: తిక్కన చమత్కారం
రాజకీయాలలో రాయబారాలకు గల స్థానము ఈనాడే కాదు, ఏనాటి నుంచో ప్రముఖమైనది. ఇరుపక్షాల వారికి అభిప్రాయభేదములేర్పడి, అవి సంకుల సమరానికి దారితీయ పరిస్థితులేర్పడినప్పుడు ఆ ప్రమాద పరిస్థితిని...
రాష్ట్రంలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్
43
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈనెల 27న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ...
పైడితల్లి దర్శనం ఉచితం
32
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారిని తొలేళ్లు, సిరిమానోత్సవం పర్వదినాల్లో భక్తుల కు ఉచిత దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ...