విజయనగరంలోని కొత్తవలస సబల స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం వ్యవస్థాపకురాలు మల్లువలస సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. సీఐఐ ఫౌండేషన్ మైక్రో ఎంటర్ప్రైజస్ విభాగంలో ఉమెన్ ఎక్సెంప్లర్ అవార్డు-2024 వరించింది.ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక వ్యాపార సమ్మిట్లో ఆమెకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రదానం చేశారు. ట్రోఫీ, ధ్రువపత్రం, రూ.3 లక్షల నగదును అందజేశారు. విజయనగరం జిల్లాలో 20 వేల మంది మహిళలకు జీవనోపాధి అవకాశాలు కల్పించినందుకు గానూ ఆమెకు ఈ అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా 300లకు పైగా నామినేషన్లు దాఖలు కాగా ఆన్లైన్లో ముఖాముఖి నిర్వహించి, క్షేత్రస్థాయిలో చేపట్టిన పనుల తీరును పరిశీలించి 16 మందిని ఎంపిక చేయగా.. అందులో సరస్వతి ఒకరు. ఈమె గృహహింస, లింగ వివక్షపై పోరాటాలు చేశారు. ఆహార భద్రత కోసం చేపట్టిన కార్యక్రమాలతో గుర్తింపు పొందారు. చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం ద్వారా వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ఈ మేరకు ఎంపిక చేసినట్లు సీఐఐ పేర్కొంది.
287views
You Might Also Like
రూ. 200 కోట్లతో భద్రాచలం ఆలయం అభివృద్ధి పనుల ప్రారంభం
6
భద్రాద్రి ఆలయ మాస్టర్ ప్లాన్ కల సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. భద్రాద్రి క్షేత్ర అభివృద్ధి పనులకు నేడు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం...
AI సాంకేతికతతో హిందూ ధర్మాన్ని కించపరుస్తున్న క్రైస్తవ సంఘాలు
27
ప్రస్తుతం నడుస్తోంది AI యుగం. AI సాంకేతికత సమాచారం కోసం వినియోగిస్తే బాగుంటుంది. కానీ.. రాయ్ పూర్ లో మాత్రం సాంకేతికతను ఉపయోగించి, హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారు....
తిరుమలలో ఆధ్యాత్మిక వనాలను విరివిగా అభివృద్ధి చేయాలి
40
శ్రీవేంకటేశ్వరస్వామివారి క్షేత్రమైన తిరుమలలో ఆధ్యాత్మిక వనాలు, ఔషధ వనాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి (ఈవో) సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు....
శతాబ్దాల సంప్రదాయాన్ని బద్దలు కొడుతూ.. రాజస్థాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం
36
శతాబ్దాల కాలంగా వస్తున్న కట్టుబాట్లను, పురుషాధిక్య రాజకుటుంబ సంప్రదాయాలను పక్కన పెడుతూ రాజస్థాన్ చరిత్రలో ఒక అద్భుతమైన సామాజిక మార్పు చోటుచేసుకుంది. రాజ్పుత్ సంప్రదాయాల ప్రకారం కేవలం...
రామనాథపురంలో శిలాయుగం ఆనవాళ్లు
39
తమిళనాడులోని రామనాథపురంలో పురాతన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సుమారు 5,000 ఏళ్ల నాటి సమాధి మట్టి కుండలు, ప్రత్యేక చిహ్నాలను పరిశోధకులు గుర్తించారు. ఇవి మెగాలిథిక్...
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి సప్తనదీ జలాలతో మహాభిషేకం
40
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక వైభవం నెలకొంది. భక్తిశ్రద్ధల మధ్య స్వామివారికి సప్త పుణ్యనదుల జలాలతో...





