News

వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా

366views

వచ్చే నెలలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రామభక్తుల చిరకాల స్వప్నం సాకారం కానుంది. 2024 జనవరి 22న అయోధ్య నగరంలో దీపాల పండుగతో మరోసారి రామాలయంలో రామ్ లల్లా దర్శనం ఇవ్వనున్నాడు. సాధువులు, భక్తుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో అమెరికాలో స్థిరపడిన భారతీయ సమాజం కోసం 500 ఏళ్లనాటి రామాలయ చరిత్రను తెలిపేలా ప్రత్యేక వెబ్‌నార్ సిరీస్‌ను సిద్ధం చేసి నేటి నుంచి ప్రారంభించారు.

ఈ సిరీస్‌లో భాగంగా గత 500 ఏళ్లల్లో ఏయే ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేశాయో ప్రదర్శించనున్నారు. అమెరికాలోని భారతీయ సమాజం కోసం ఈ బృహత్తర ఆలోచనను అమెరికాలోని విశ్వహిందూ పరిషత్ విభాగం చేసింది. జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి ముందు భారతదేశంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశంలోని 8 వేల మంది ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు పంపుతున్నారు. మరోవైపు జనవరి 22న భారీగా తరలివచ్చే భక్తుల కోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.