
258views
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆలయంలో సెప్టెంబరు 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహించారు. ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 27వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 28న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 29న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.750/- చెల్లించి ఒకరోజు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు.





