News

టీటీడీ ఆరోగ్యశ్రీ వరప్రసాదిని పథకానికి కోటి విరాళం 

155views

టీటీడీకి ఆదివారం భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన వడ్లమూడి సరోజినీ రూ.కోటి విరాళాన్ని అందజేశారు.
వివరాల ప్రకారం.. తన భర్త వడ్లమూడి రమేష్‌ బాబు జ్ఞాపకార్థం టీటీడీ ఆరోగ్యశ్రీ వరప్రసాదిని పథకానికి హైదరాబాద్‌కు చెందిన వడ్లమూడి సరోజినీ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. విరాళం డీడీని దాతల కార్యాలయంలో ఆదివారం ఆమె అందజేశారు.