
473views
న్యూఢిల్లీ: అరబ్ దేశాల్లో తప్పు చేసిన వారికి విధించే శిక్షలు ఎంతో కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మాదకద్రవ్యాలు, ఆత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాల్లో దోషులుగా తేలిన వారికి బహిరంగంగా మరణ శిక్షణను అమలు చేస్తారు. తాజాగా సౌదీ అరేబియాలో పది రోజుల వ్యవధిలో 12 మంది నేరస్థులకు బహిరంగంగా శిరచ్ఛేదం శిక్షను అమలు చేశారు. వీరంతా మాదకద్రవ్యాల కేసులో దోషులు. మరశిక్షణ పడిన వారిలో ముగ్గురు పాకిస్థానీయులు, నలుగురు సిరియా వాసులు, ఇద్దరు జోర్డాన్ దేశస్థులు, ముగ్గురు సౌదీకి చెందినవారు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో వివిధ నేరాల్లో దోషులుగా ఉన్న 81 మందికి సౌదీ ప్రభుత్వం మరణశిక్షణను అమలు చేసింది. వీరిలో ఉగ్రవాద సంస్థలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నట్టు అంతర్జాతీయ వార్తా కథనాలు పేర్కొన్నాయి.





