News

టిబెట్‌ పీఠభూమిలో చైనా తిష్ఠ!

408views

న్యూఢిల్లీ: అంతరిక్ష పరిశోధనల విషయంలో చైనా క్రమంగా దూసుకుపోతోంది. చంద్రుడిపై శాశ్వతంగా నీడలో ఉండిపోయే ప్రాంతాలపై పరిశోధనల నుంచి గ్రహశకలాలపైకి వ్యోమనౌకలను పంపడం వరకూ అనేక ఆలోచనలను చేస్తోంది. ఇప్పుడు సూర్యుడి వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి శక్తిమంతమైన టెలిస్కోపులను సిద్ధం చేసింది. టిబెట్‌ పీఠభూమిపై డావోచెంగ్‌ సోలార్‌ రేడియో టెలిస్కోపు (డీఎస్‌ఆర్‌టీ) నిర్మాణాన్ని చైనా పూర్తి చేసింది. వచ్చే ఏడాది జూన్‌లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించే వీలుంది. 1.4 కోట్ల డాలర్ల వ్యయంతో దీన్ని చైనా నిర్మించింది. దీని సాయంతో అంతరిక్షం, భూ వాతావరణంపై భానుడి ప్రభావం గురించి శోధించవచ్చు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి