News

ఇక నుంచి సుప్రీం కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం

360views

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో జరిగే కేసుల విచారణను ఇక సామాన్య పౌరులు సైతం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. న్యాయస్థానం కార్యకలాపాలను లైవ్​ ద్వారా ప్రసారం చేసేందుకు రంగం సిద్ధమైంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ యూయూ లలిత్​ నేతృత్వంలో జరిగిన ఫుల్​ కోర్ట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు.

విచారణ ప్రత్యక్ష ప్రసారంపై న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేయగా.. సుప్రీంకోర్టు సిబ్బంది అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారం(సెప్టెంబర్​ 27) నుంచి కేసుల విచారణ లైవ్​ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తొలుత రాజ్యాంగ ధర్మాసనం కేసుల్ని మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి