
అమరావతి: తన ప్రభుత్వపు రోజువారీ ఖర్చుల కోసం హిందూ దేవాలయాల నిధులను దుర్వినియోగం చేస్తూ వస్తున్న ఏపీలోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ఆలయాల పేరుతో బ్యాంకులలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై దృష్టి పెట్టింది. ఫిక్సిడ్ డిపాజిట్లను రద్దు చేయమని ఎండోమెంట్స్ కమీషనర్ ఆదేశాలు జారీ చేయడం కలకలం సృష్టిస్తోంది.
ఇప్పటికే, ఈ నెలలో 13వ తేదీ వరకు రూ 45 కోట్ల డిపాజిట్లను వివిధ దేవాలయాల కార్యనిర్వహణ అధికారులు రద్దుచేశారు. మొత్తంగా రూ.500 కోట్ల మేరకు ఆ విధంగా డిపాజిట్లను రద్దు చేయాలని దేవాదాయశాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
పైగా, ఆ విధంగా బ్యాంకుల్లో రద్దు చేసిన ఎఫ్డీల నగదును సిజెఎఫ్కు ఆలయ అధికారులు జమ చేస్తున్నారు. వాస్తవానికి సిజిఎఫ్ నిధులను ఆలయాల జీర్ణోనోద్ధరణకు ప్రభుత్వం వినియోగించాల్సి ఉంది. అయితే, ప్రస్తుత ప్రభుత్వంలోని మాజీ దేవాదాయశాఖ మంత్రి సిజిఎఫ్ నిధులను ఇష్టానుసారం బదలాయించి ప్రభుత్వ ఖర్చులకోసం వాడుకొంటూ వచ్చారు.
ఇప్పుడు కూడా ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొనే ఎత్తుగడ స్పష్టమవుతుంది. ఈ విధంగా అర్ధాంతరంగా ఫిక్సిడ్ డిపాజిట్స్ రద్దు చేయడం పట్ల భక్తులు మండిపడుతున్నారు. దీనివల్లనే ఆలయాలు దీపదూప నైవేద్యాలకు సైతం ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా అయినవల్లి వినాయక ఆలయం లో రూ.30 లక్షలు, నెల్లూరు జిల్లా మూలస్ధానేశ్వరస్వామి ఆలయంలో రూ.30 లక్షలు, సింగరాయపాలెం సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో రూ. 20 లక్షలు, విజయవాడ యనమలకుదురు శివాలయంలో రూ.30 లక్షలు, వేదాద్రి యోగానంద లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో రూ.60 లక్షలు, ఎన్టీఆర్ జిల్లా కోటిలింగాలు ఆలయంలో రూ.40 లక్షలు చొప్పున ఎఫ్డీలను రద్దు చేస్తున్నట్టు సమాచారం.
Source: Nijamtoday





