News

భారత్‌పై అమెరికా ముస్లిం అధికారి అనుచిత వ్యాఖ్యలు!

327views

వాషింగ్ట‌న్‌: ఉదయ్‌పూర్ టైలర్ హత్య ఉదంతం నేపథ్యంలో అమెరికా సీనియర్ ముస్లిం అధికారి భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మతపరమైన మూక హత్యల ముప్పు భారత్‌లో అధికంగా పొంచివుందని అంతర్జాతీయ మతస్వేచ్ఛకి బ్రాండ్‌ అంబాసీడర్‌గా వ్యవహరిస్తున్న అమెరికా అధికారి రషాద్ హుసేన్ హెచ్చరించారు.

సామూహిక హత్యల ముప్పు కలిగివున్న దేశాలపై జర్మనీలోని హోలోకౌస్ట్ మ్యూజియం రూపొందించిన ‘ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్ట్’ నివేదికలో భారత్ రెండో స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు. 2021 లేదా 2022లో మూకుమ్ముడి హత్యలకు ఇండియాలో 14.4 శాతం అవకాశాలున్నాయి. 15.2 శాతం ముప్పు అవకాశమున్న పాకిస్తాన్‌ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉందని రిపోర్ట్ పేర్కొంది.

భారత్‌లో మైనారిటీ మతస్తుల హక్కులకు ప్రమాదకరంగా పరిణమించిన పలు అంశాలు ఇందుకు కారణమవుతున్నాయని హుసేన్ పేర్కొన్నారు. ఈ అంశాలపై భారత్‌తో అమెరికా ప్రత్యక్షంగా మాట్లాడి, తన ఆందోళనను వెలిబుచ్చిందని ఆయన ప్రస్తావించారు. ‘‘ చర్చిలపై దాడులు, హిజాబ్‌పై నిషేధం, గృహాల ధ్వంసాలు, అమానవీయ వ్యాఖ్యలు చూశాం. ఒక మంత్రి ముస్లింలను చీడపురుగులతో పోల్చారు ’’ అని హుసేన్ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి