News

భారత్‌పై ముస్లిం హ్యాకర్ల‌ సైబర్ దాడులు!

Business Corporate Protection Safety Security Concept
492views

న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు నిరసనల పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం హ్యాకర్స్‌ భారత్‌పై సైబర్ దాడులు చేయడం మెదలు పెట్టారు. కొన్ని గంటలుగా దేశంలో 70కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు వెబ్‌సైట్స్‌, పోర్టర్స్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఇండియన్ కౌన్సిల్‌ ఆఫ్ అగ్రికర్చర్ రీసెర్చ్‌తో పాటు హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెబ్‌సైట్స్‌కు కూడా హ్యాక్ అయ్యాయి.

ఒక్క మహారాష్ట్రలోనే 50కిపైగా సంస్థలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసిన తర్వాత మీ కోసం మీ మతం.. మాకు మా మతం అంటూ సందేశాన్ని పోస్ట్ చేశారు. భారత్‌కు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వెబ్‌సైట్లను సైబర్‌ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. దేశ వ్యాప్తంగా 70 వెబ్‌సైట్లు, పోర్టల్స్‌ను హ్యాక్‌కు గురయ్యాయి. డ్రాగన్‌ఫోర్స్‌, మలేషియా, 1877 సంస్థ, కురుదేశ్‌ కోరడర్స్‌ పేరుతో హ్యా్‌క్‌ అయ్యాయి. అలాగే హైదరాబాద్‌కు చెందిన అగ్రిటెక్‌ కంపెనీలు, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ పోర్టల్స్‌ హ్యాక్‌కు గురయ్యాయి. అంతేకాకుండా కొన్ని బ్యాంకింగ్‌ వెబ్‌సైట్లు కూడా హ్యాక్‌కు గురయ్యాయి. ఈ నెల ఎనిమిదోతేదీ నుంచి 12వ తేదీ మధ్య భారత ప్రభుత్వానికి చెందిన వెబ్‌సైట్లతో పాటు ప్రైవేటు కంపెనీల పోర్టల్స్‌ హ్యాక్‌ అయినట్లు సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి